High Tension in Chandur : పోలింగ్ ముగిసే వేళ.. చండూరులో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. గుంపులు గుంపులుగా చేరి కొట్టుకున్నారు. దీంతో, చండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీలతో వారిని అక్కడి నుంచి తరిమేశారు. ప్రస్తుతానికి గొడవ సద్దుమనిగినా.. ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలు మళ్లీ పోలీంగ్ కేంద్రం దగ్గరకు చేరుకుంటున్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి గొడవ జరగకుండా అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉన్నారు.