Hyderabad: దేశీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది రాజేశ్ ఎక్స్పోర్ట్స్ స్కామ్. ఈ సెగ ఇప్పుడు తెలంగాణాను తాకింది. అంతేకాదు తెలంగాణ రాజకీయాల్లో తుపాను రేపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్- పెట్టుబడులకు సంబంధించి ఆ కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్ని అస్త్రంగా చేసుకుని కేటీఆర్పై అధికార-విపక్షాలు విమర్శల దాడి తీవ్రతరం చేశాయి.
రాజేశ్ ఎక్స్పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు
రాజేశ్ ఎక్స్పోర్ట్స్ స్కామ్ వ్యవహారం సెగ తెలంగాణకు తాకింది. నాలుగేళ్ల కింద అంటే సరిగ్గా 2022 జూన్లో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీతో పెట్టుబడులకు సంబంధించి ఓ ఒప్పందం చేసుకున్నారు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది కూడా ఒకటి.
దేశంలో అత్యంత అధునాతనమైన అమోలెడ్ డిస్ప్లేలను తయారు చేసేందుకు తెలంగాణలో 24 వేల కోట్ల పెట్టుబడి పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు ఆ కంపెనీ ఛైర్మన్ రాజేష్ మెహతా. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ‘హిస్టోరీకల్ డే ఫర్ తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు సదరు మంత్రి.
ఆనాడు హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్.. ఎదురుదాడి మొదలుపెట్టిన పార్టీలు
ఇప్పుడు ఈ ట్వీట్ని తెరపైకి తీసుకొచ్చిన అధికార-విపక్షాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు తీవ్రతరం చేశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ తెలంగాణకు తెచ్చిన ఘనమైన కంపెనీ ఇదేనా అంటూ విమర్శలు మొదలు పెట్టాయి. ఈ స్కామ్లో మీ.. ఎంత? అంటూ బీఆర్ఎస్ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.
తప్పుడు రికార్డులున్న కంపెనీని వెనకేసుకొచ్చిన కేటీఆర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీశారంటూ రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజేశ్ ఎక్స్పోర్ట్స్ స్కామ్ వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ లో చిన్నపాటి కుదుపు మొదలైంది.
ALSO READ: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!
దీనిపై బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆ కంపెనీ స్కామ్కు మాకు సంబంధం ఏంటని ఎదురుదాడి మొదలుపెట్టారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.