Blood Mafia: హైదరాబాద్లోని షేక్పేట ప్రాంతంలో వెలుగుచూసిన ‘బ్లడ్ మాఫియా’ ఉదంతం నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి, నోరు లేని జీవాల రక్తంతో వ్యాపారం చేయడం అత్యంత అమానుషం. ఒక ప్రైవేట్ యానిమల్ హాస్పిటల్ కేంద్రంగా ఈ దందా జరుగుతుంది.
అక్రమ దందా సాగుతోంది ఇలా..
స్థానిక ఆసుపత్రి సిబ్బంది వీధి కుక్కలను సంరక్షిస్తున్నామనే ముసుగులో వాటిని తెచ్చి బంధిస్తున్నారు. చికిత్స కోసం వచ్చే పెంపుడు కుక్కల యజమానులే వీరి ప్రధాన లక్ష్యం. మీ కుక్కకు తీవ్ర రక్తహీనత ఉందని, వెంటనే రక్తం ఎక్కించకపోతే చనిపోతుందని తప్పుడు నివేదికలతో యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక్కో బ్లడ్ ప్యాకెట్ను రూ. 18 వేల నుంచి రూ. 25వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
మూగజీవాల బలి..
నిజానికి అవసరం లేకపోయినా పెంపుడు కుక్కలకు రక్తం ఎక్కించడం ఒక ఎత్తైతే, ఆ రక్తం కోసం వీధి కుక్కలను హింసించడం మరో ఎత్తు. బంధించిన వీధి కుక్కల శరీరం నుండి విచక్షణారహితంగా రక్తాన్ని పీల్చేస్తుండటంతో, అవి రక్తహీనతకు గురై ప్రాణాలు వదులుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న మూగజీవాలను కేవలం డబ్బు కోసం బలిపశువులను చేయడం దారుణం.
జంతు ప్రేమికులు ఈ దందాను పసిగట్టి ఆధారాలతో సహా జీహెచ్ఎంసీ (GHMC) అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంపుడు జంతువుల యజమానులు కూడా ఇలాంటి మోసపూరిత నివేదికల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Also Read: మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!
కుక్కల రక్తంతో వ్యాపారం..ప్యాకెట్ రక్తం రూ.18 నుంచి రూ.25 వేలు
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలే వారి లక్ష్యం
హైదరాబాద్ షేకే పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుక్కల రక్తంతో వ్యాపారం
జీహెచ్ ఎంసీకి ఫిర్యాదు చేసిన జంతు ప్రేమికులు
చికిత్స, సంరక్షణ పేరుతో వీధికుక్కలను… pic.twitter.com/tX4FWVIlsM
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2026