E-Paper
Advertisement

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Advertisement

Markapuram Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు, భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు భారీ పరిహారం పంపిణీ చేయనుండటం ఈ పర్యటనలో కీలకమైన ఘట్టం. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం షెడ్యూల్: వెలిగొండ కెనాల్ పరిశీలన, పరిహారం పంపిణీ

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనను హైదరాబాద్ నుండి ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ప్రయాణమై, 10.45 గంటలకు దోర్నాల మండలం గంటావానిపల్లికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల వద్దకు చేరుకుని, ఉదయం 11 గంటలకు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

అనంతరం వెలిగొండ ప్రాజెక్టు లబ్ధిదారులు, నిర్వాసితులు, అలాగే సంబంధిత అధికారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడతారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఊరట కలిగిస్తూ, రూ. 300 కోట్ల పరిహారాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.

Advertisement

Also Read: యూరియా యాప్‌లో పెద్ద స్కామ్? రెండు జిల్లాల పేర్లు మాయం.. కేతిరెడ్డి సంచలన ఆరోపణలు!

మధ్యాహ్నం షెడ్యూల్: డిజిటల్ హెల్త్ సెంటర్ ప్రారంభం

గంటావానిపల్లి పర్యటన ముగించుకుని, మధ్యాహ్నం 12.35 గంటలకు హెలికాప్టర్‌లో గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లికి సీఎం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.55 గంటలకు కిష్టంశెట్టిపల్లి చేరుకున్న అనంతరం, ఒంటి గంట పది నిమిషాలకు (1.10 గంటలకు) అక్కడి స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్’ను ప్రారంభిస్తారు. వైద్య రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికే ఈ కేంద్రం ద్వారా అందే సేవలపై లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు.

సాయంత్రం షెడ్యూల్: ప్రజావేదిక సభ, కార్యకర్తల భేటీ

ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటల నుండి 3.30 గంటల వరకు కిష్టంశెట్టిపల్లిలో నిర్వహించనున్న భారీ ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ వేదికపై నుండి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు.

సభ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 3.35 గంటల నుండి సాయంత్రం 5.05 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని, వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లిలోని తన నివాసానికి తిరుగుపయనమవుతారు. సీఎం రాకను పురస్కరించుకుని అధికారులు, స్థానిక నాయకులు భారీ బందోబస్తు, ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీ రాజకీయాల్లో కొత్త అంకం.. అలర్టయిన కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల సంయుక్త ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం

దటీజ్ డిప్యూటీ సీఎం.. పవన్ దెబ్బకి మారిపోయిన రోడ్డు.. వాహనదారుల ప్రశంసలు!

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

Big Stories

Advertisement
×