Karimnagar: కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన సమాజం ఎటువైపు వెళ్తోందో అన్న ఆందోళన కలిగిస్తోంది. మనిషి ప్రాణం కంటే మూఢనమ్మకాలు, పట్టింపులకే ఎక్కువ విలువ ఇచ్చే మనుషులు ఉన్నంత కాలం మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్లో గాండ్ల శ్రీకాంత్ (40) అనే వ్యక్తి తన భార్య రూప, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే శ్రీకాంత్ గత కొంతకాలంగా సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే.. అద్దె ఇంటి యజమాని ప్రవర్తన ఆ బాధను మరింత రెట్టింపు చేసింది.
శ్రీకాంత్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత భార్యా పిల్లలు ఇంటికి తిరిగి రాగా, యజమాని వారిని లోపలికి రానివ్వలేదు. ‘చావు జరిగిన ఇంట్లోకి ఇప్పుడే రానివ్వను, పదవ రోజు కర్మకాండలు పూర్తయ్యాకే అడుగు పెట్టాలి’ అంటూ గేటుకు తాళం వేశాడు. దిక్కుతోచని స్థితిలో, ఆశ్రయం కల్పించే వారు లేక ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి గత ఆరు రోజులుగా శ్మశాన వాటికలోనే తలదాచుకుంటోంది.
కళ్ల ముందు కన్న తండ్రి లేడన్న బాధ ఒకవైపు, ఉండటానికి నీడ లేక శ్మశానంలో గడపాల్సిన దుస్థితి మరోవైపు.. ఆ పిల్లల దీనస్థితి చూస్తుంటే స్థానికుల కళ్లు చెమర్చుతున్న యి. మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఇంతటి కఠినత్వం ఉందా అనిపిస్తోంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన మనుషులే అపశకునాల పేరుతో రోడ్డున పడేయడం అత్యంత బాధాకరం.
Also Read: హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి
కరీంనగర్ లో హృదయ విదారక ఘటన.
ఆరు రోజులుగా శ్మశానంలోనే కుటుంబం
కరీంనగర్ లోని చింతకుంట గాంధీనగర్ లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య.
ఆరు రోజుల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య.
దశదిన ఖర్మ అయ్యాకే ఇంటికి రావాలని ఆంక్షలు పెట్టిన ఇంటి ఓనర్.… pic.twitter.com/23PnvaMTZL
— ChotaNews App (@ChotaNewsApp) April 27, 2026