E-Paper
Advertisement

Hyderabad Metro : మెట్రో 2.O.. 7 కారిడార్లకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన

Hyderabad Metro : మెట్రో 2.O.. 7 కారిడార్లకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
Advertisement

Hyderabad Metro 2.O : హైదరాబాద్ మెట్రో.. ఎందరో వేల ఉద్యోగుల, స్టూడెంట్ల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది. గంటల తరబడి.. కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ కష్టాలను తగ్గించి.. నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఆర్టీసీ కంటే.. మెట్రోకే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. తాజాగా.. మెట్రో రెండోదశ పనులకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి దశ మెట్రోకు అనుసంధానంగా.. మొత్తం 7 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో కారిడార్ లను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే నిర్వహించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించి పనుల్లో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరగా మెట్రో రెండో దశ పనులను మొదలు పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం.. త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది.

Read More : వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Advertisement

హైదరాబాద్ రెండో దశ మెట్రోలో.. నాగోల్ – శంషాబాద్ మార్గం కీలకం కానుంది. చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని, అందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. మొత్తం 7 కారిడార్లలో అత్యంత పొడవైన కారిడార్ నాగోల్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గం. దీని దూరం 21 కిలోమీటర్లు ఉంది.

మియాపూర్ – పటాన్ చెరు – 14 కిలోమీటర్లు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ 8 కిలోమీటర్లు, రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ 8 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట మరో 8 కిలోమీటర్ల మేర మెట్రోలను నిర్మించేందుకు డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటే నాగోల్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో ఇన్నర్ రింగురోడ్డుపై ఉన్న చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో ఇంటర్ చేంజ్ స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×