E-Paper
Advertisement

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..
Advertisement

Medaram Jathara

Medaram Jathara: నాలుగు రోజులు అట్టహాసంగా సాగిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసింది. వనం నుంచి వచ్చిన దేవతలను రాత్రి తిరిగి వన ప్రవేశం చేశారు. అమ్మలు వనానికి చేరే సమయంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి.  జాతర ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు సాంప్రదాయ పద్దతిలో పూజారులు నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తం అయ్యింది.

Advertisement

పూజల అనంతరం  వనదేవతల వన ప్రవేశం మొదలయ్యింది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రక్రియతో జాతర ముగిసింది. అయితే ఈక్రతువును చూడాడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క రోజే మేడారానికి పోటెత్తి వెళ్లారు. ఇలా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

Read More: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

Advertisement

ఈ మూడు రోజులు వనదేవతలను దర్శించుకున్న భక్తులు చివరి ఆఖరి ఘట్టాన్ని తమ మదిలలో చెరగని ముద్రలా వేసుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించింది.

 

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×