BigTV English

Hyderabad Pub Raid: మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

Hyderabad Pub Raid: మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

Manikonda drugs case today news(Latest news in Hyd): మణికొండలోని కేవ్ పబ్ లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినిత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవ్ పబ్ లో పట్టుబడినవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజీ నిర్వాహకుడు ఆయూబ్ తోపాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లుగా తేలిందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలను తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఉన్నారన్నారు.


పబ్ లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్ సేకరించినట్లుగా గుర్తించామన్నారు. 25 మందిపైనా ఎన్ డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట డ్రగ్స్ తీసుకునే పబ్ లోకి వచ్చినట్లుగా విచారణలో తేలిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారని, పక్కా సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు.

Also Read: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతు కోసి దారుణ హత్య


మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్ పబ్ ను సీజే చేశామని చెప్పారు. ఈ కేసులో పబ్ మేనేజర్ శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఐటీ సంస్థలు వారి సిబ్బందికి డ్రగ్స్ తీసుకోవొద్దని అవగాహన కల్పించాలని సూచించారు. త్వరలో మిగిలిన పబ్ లలో కూడా సోదాలు నిర్వహిస్తామన్నారు. గతంలో కూడా ఈ పబ్ లో ఇలాంటి తరహా పార్టీలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. పబ్ యజమానులు నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వస్తుందని డీసీపీ తెలిపారు.

Tags

Related News

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కేసీఆర్ ప్రకటన

KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Big Stories

×