Hyderabad: నగరంలోని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు ముఖ్యమైన ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటల కారణంగా కార్యాలయం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.