E-Paper
Advertisement

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!
Advertisement

AV Ranganath: హైదరాబాద్‌లో ఆక్రమణల ప్రక్షాళన పేరుతో నిత్యం వార్తల్లో నిలిచే ‘హైడ్రా’, కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ప్రజా క్షేత్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆయన పనితీరుపై కోర్టు వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు నడుస్తుంటే.. మరోవైపు ఆయనకు మద్దతుగా సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడం విశేషం.

తాజాగా రంగనాథ్ స్థానంలో వేరొకరిని నియమించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. అమీర్‌పేట్, మధురానగర్ ప్రాంతాల్లో స్థానికులు ధర్నా చేపట్టారు. ‘సేవ్ హైడ్రా.. రంగనాథ్‌ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. దశాబ్దాలుగా చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన బడా బాబుల పై భయం లేకుండా చర్యలు తీసుకుంటున్న ధైర్యమైన అధికారి ఆయనేనని, అందుకే ఆయనను బదిలీ చేయవద్దని డిమాండ్ చేశారు.

Advertisement

అయితే, న్యాయపరమైన నిబంధనలు, నోటీసుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు కూడా ఆయనపై లేకపోలేదు. రంగనాథ్‌ను కొనసాగించాలా లేదా అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినప్పటికీ.. ఆక్రమణలపై ఆయన చూపిన కఠిన వైఖరి, పారదర్శకత నగర భవిష్యత్తుకు ఎంతో అవసరమన్నారు. చట్ట పరిధిలోనే ఆ వ్యవస్థను బలోపేతం చేయాలని మెజారిటీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

Also Read: CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!

Tags

Related News

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

Big Stories

Advertisement
×