E-Paper
Advertisement

Hydra: రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!

Hydra: రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!

Hydra: ఆ స్థలాల్ని కొల‌త‌ల్లో లెక్క‌ క‌డితే సుమారు ఏడు వేల గ‌జాలు. డ‌బ్బుల్లో విలువను అంఛనా వేస్తే సుమారు రూ. 85 కోట్లు. ప్రాణ వాయువును అందించే పార్కులుగా లెక్క‌లు క‌డితే ఆ విలువ అపరిమితం. అందుకే పార్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా ప్రాధాన్యతనిస్తున్నట్లు హైడ్రా వెల్లడించింది. ఈ క్ర‌మంలోనే మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా, ఉప్ప‌ల్ మండ‌లంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7 వేల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థ‌లాల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది. వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్‌చేసుకుంటూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారి ఆగడాలకు అడ్డుక‌ట్ట వేసింది. 1980లో 183 ప్లాట్ల‌తో బాబాన‌గ‌ర్ కాల‌నీ లే ఔట్‌ను వేశారు. ఇందులో 3 వేల గ‌జాల స్థ‌లాన్ని పార్కు కోసం కేటాయించారు.

Also Read: Comedy Movie OTT : చావురోజే పెళ్లి… బ్లాక్ బస్టర్ జీవా మూవీ ఓటీటీలో… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే ?

హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు

1999 వ సంవ‌త్స‌రం వ‌ర‌కూ ఇది పార్కుగానే కొన‌సాగింది. కాప్రా స‌ర్కిల్ అధికారులు ఈ మేర‌కు హ‌ద్దులు నిర్ధారించి ప్ర‌హ‌రీ కూడా నిర్మించారు. కాని త‌ర్వాత ఆ లే ఔట్‌లో 183 ఉన్న ప్లాట్ల సంఖ్య 189కి పెరిగిపోయింది. మొత్తం 3 వేల గ‌జాల‌ను 500 గ‌జాల చొప్పున 6 ప్లాట్లుగా మార్చేశారు. ఇలా పార్కునే ప్లాట్లుగా చేసి అమ్మిన ప్లాట్ల‌లో 188వ ప్లాట్ కొన్న బొట్ల సాయి త‌ర్వాత కాల‌నీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడ‌ు అయ్యాడు. 500 గ‌జాల ప్లాట్‌లో 266 గ‌జాల మేర బొట్ల సాయి ఇల్లు నిర్మించుకున్నట్లు హైడ్రా నిర్థారించింది. మిగిలిన 234 గ‌జాల స్థ‌లాన్ని ఖాళీగా ఉంచాడు. 188 ప్లాట్‌కు ప‌క్క‌న ఉన్న ర‌హ‌దారి స్థ‌లాన్ని కూడా క‌బ్జా చేస్తూ బై నెంబ‌ర్లు వేసి బొట్ల సాయి 50 గ‌జాల చొప్పున మ‌రో 6 ప్లాట్లు చేసి అమ్మాడంటూ మొత్తం ఉదంతంపై అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలన 

3 వేల గ‌జాల పార్కును కాపాడాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. 3 వేల గ‌జాలు పార్కుకు కేటాయించిన‌ట్టు నిర్ధారించుకున్నారు. ఇప్ప‌టికే కొన్ని నివాసాలు రాగా, మిగిలిన 2 వేల గ‌జాల స్థ‌లాన్ని ప‌రిర‌క్షిస్తూ ఫెన్సింగ్ వేసినట్లు హైడ్రా తెలిపింది. పార్కు స్థ‌లంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే ఉప్ప‌ల్ మండ‌లం నాచారం గ్రామంలోని కార్తికేయ న‌గ‌ర్‌లో కూడా 3 ఓపెన్ ప్లేస్‌ల‌తో పాటు, పార్కుల‌కు కేటాయించిన 5 వేల గ‌జాల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది. పార్కు స్థ‌లాల‌ను కాపాడిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read: Bank of Baroda: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ బంగారు భవిష్యత్తు, దరఖాస్తు వివరాలివే..

Tags

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×