E-Paper
Advertisement

Telangana BJP: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్.. పడిపోతుందా..?

Telangana BJP: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్.. పడిపోతుందా..?
Advertisement

భవిష్యత్‌ ఎన్నికలు, పార్టీ విస్తరణ.. ఈ అజెండాతో బీజేపీ ఓ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. ఈ మీటింగ్‌లో పార్టీ ఫ్యూచర్‌ పరిస్థితేంటో కానీ.. ప్రసెంట్ అయితే ఏం బాగా లేదని తెలుస్తోంది. ఈ మీటింగ్‌కి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డితో పాటు ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటెండ్ అయ్యింది ఒకే ఒక్కరు. ఆయనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త.. అటు ఎమ్మెల్యేలు రాలేదు.. ఎమ్మెల్సీలూ రాలేదు. దీంతో మరోసారి ప్రచారం మొదలైంది. పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ పెరిగింది అని.. మరి జరుగుతుంది కదా.. పార్టీ పెద్దలంతా వచ్చి.. నేతలు రాకపోతే..

Advertisement

మరి మీటింగ్‌కు ఎందుకు రాలేదు అంటే.. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్.. పార్టీ ఆఫీస్‌కు కూత వేటు.. అంటే పిలిస్తే పలికేంత దూరంటో ఉండే రాజాసింగ్ కూడా.. పార్టీ ఆఫీస్‌ మొఖం చూడలేదు. చాలా రోజులుగా పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఓ రకమైన అలక కనిపిస్తోంది. పార్టీ యాక్టివిటీస్‌లో తమను ఇన్‌వాల్వ్‌ చేయడం లేదని. అందుకే ఈ మీటింగ్‌కు లైట్‌ తీసుకున్నారనేది టాక్. నిజానికి తెలంగాణలో గతంలో కంటే మంచి పోజిషన్‌లో ఉంది. దానిని మరింత మెరుగుపరుచుకునే చాన్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ టైమ్‌లో లీడర్సంతా కలిసికట్టగా ఎన్నికలకు రెడీ కావాలి. కానీ ఆ పరిస్థితులు లేవు. హైకమాండ్ కూడా ఇవన్నింటిని పరిశీలిస్తూనే ఉంది. అందుకే ఇలాగైతే కష్టమన్న భావనకు వచ్చినట్టుంది. అందుకే నేరుగా బీఎల్ సంతోష్‌తో పాటు మరికొంత మంది అ్రగ నేతలు ల్యాండ్ ఆయ్యారు.

పార్టీ కార్యక్రమాల్లో ఏం జరుగుతుంది? అంతర్గత వ్యవహారాల్లో ఏం జరుగుతుంది? ఇలా అన్ని అంశాలపై కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్స్ అందాలి. కానీ అలా జరగడం లేదనేది కమలనాథుల సర్కిల్స్‌లోనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అధ్యక్ష బాధ్యతల మార్పు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. అయితే 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అసలు టార్గెట్‌ అని తెలుస్తోంది.

Advertisement

Also Read: హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్,చార్లెస్ స్క్వాబ్,దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్

హైకమాండ్ దూరదృష్టితో ఉంటే.. లోకల్ నేతలు మాత్రం పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. మీకు మీరే.. మాకు మేమే అనే తీరు అర్ధవంతంగా కనిపిస్తోంది. అధ్యక్ష పదవి కోసం రెండుగా చిలీపోయారు నేతలు. కొత్త, పాత అంటూ రెండు గ్రూప్‌లు కట్టేశారు.. మరి అసలు పరిస్థితేమో ఇలా ఉంది. పార్టీ పెద్దలేమో భారీ ఆశలతో వస్తున్నారు. ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నేతలను చక్కదిద్దకపోతే పరిస్థితులు మెరుగవ్వడం పక్కన పెడితే.. మరింత దిగజారడం ఖాయం.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×