E-Paper
Advertisement

MallaReddy: మల్లారెడ్డి సంస్థల్లో భారీగా అక్రమాలు!.. ఐటీ చెప్పిన వివరాలు ఇవే..

MallaReddy: మల్లారెడ్డి సంస్థల్లో భారీగా అక్రమాలు!.. ఐటీ చెప్పిన వివరాలు ఇవే..
Advertisement

MallaReddy: 400 మంది ఐటీ ఆఫీసర్స్. 65 బృందాలతో సెర్చింగ్. తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి తరలివచ్చిన అధికారులు. ఒకేసారి మూకుమ్మడిగా రైడ్ చేశారు. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యాసంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. తెలుగునాట బిగ్గెస్ట్ ఐటీ రైడ్ ఇది. రెండురోజులుగా సినిమాటిక్ స్టైల్ లో సాగింది. ఇంతకీ ఐటీ రైడ్స్ లో ఏం దొరికింది? అక్రమాలు జరిగాయా? అధికారులు ఏం చెబుతున్నారు? అనేది ఆసక్తికరం.

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించినట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించారు. లెక్కల్లో చూపని ఆ నగదును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని తేల్చారు. మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా అదే మనీని ఖర్చు చేసినట్టు ఐటీ అధికారులు ఐడెంటిఫై చేశారు.

Advertisement

ఇప్పటి వరకైతే 6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే, ఇంకా పలు లాకర్లు తెరవాల్సి ఉందని, అవి తెరిస్తే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని అంటున్నారు ఐటీ సిబ్బంది. భూముల విలువ కూడా తక్కువ చేసి చూపించారని.. మార్కెట్ వ్యాల్యూతో లెక్కేయాల్సి ఉందని చెబుతున్నారు.

అటు, మంత్రి మల్లారెడ్డి సైత ఐటీ సోదాలపై స్పందించారు. ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, ధ్రువపత్రాలు సరిగ్గానే ఉన్నాయని అన్నారు. కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు అందజేశామని.. వారికి అన్ని విధాలా సహకరిస్తున్నామని చెప్పారు. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×