E-Paper
Advertisement

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?

Vijaysai: విజయసాయి ఐఫోన్ మిస్సింగ్.. అందుకేనా..?
Advertisement

Vijaysai: ఫోన్లు పోవడం కామన్. అయితే, ప్రముఖుల ఫోన్లు పోవడమనేది అస్సలే కామన్ కాదు. అందులోనూ, అల్లుడు అరెస్టై.. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఫోన్ పోవడం మరింత అనుమానాస్పదం అంటున్నారు. ఇంకెవరు, ఇద్దంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించే.

ఈ నెల 21 నుంచి విజయసాయిరెడ్డికి చెందిన ఐ ఫోన్ 12ప్రో కనిపించడం లేదంటూ.. ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫోను పోయిన సమయం, సందర్భం.. ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది.

Advertisement

ఇదే ఛాన్స్ గా టీడీపీ సెటైర్లు వేస్తోంది. అవునా, విజయసాయిరెడ్డి తాడేపల్లి ఎప్పుడు వెళ్లారు? ఈ నెల 21న ఆయన తాడేపల్లిలో ఉన్నట్టు ఎక్కడా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ ఫోన్ పోయిందా? లేదంటే, జగన్ లాగేసుకున్నారా? అంటూ ఓ టీడీపీ మాజీ మంత్రి పంచ్ లు వేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు పోయిందంటూ ఫిర్యాదు చేశారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. మరి, ఫోన్ ఎందుకు దాచేశారో కూడా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో సీబీఐ విచారణ లోతుగా సాగుతోంది. ఆ లిక్కర్ స్కాం లింకులు విజయసాయిరెడ్డికి ఉండబట్టే.. సీబీఐ వాళ్లు తన ఫోను సీజ్ చేస్తే గుట్టంతా రట్టు అవుతుందనే భయంతోనే ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేసి నాటకం ఆడుతున్నారనేది టీడీపీ ఆరోపణ. నిజమో కాదో తెలీదు కానీ.. నిజమే అన్నట్టుగా ఆ ప్రచారం సాగుతోంది.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×