Big Stories

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?

Jagadeesh Reddy : మునుగోడు ఎన్నిక వేళ ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. నల్గొండలోని ఆయన నివాసంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు లభించినట్టు సమాచారం.

- Advertisement -

మునుగోడు బై పోల్ కు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఐటీ రైడ్స్ అధికార పార్టీని షేక్ చేస్తోంది. మునుగోడు గెలుపు బాధ్యతలు మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోగా.. ఇప్పుడు ఆయన పీఏ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేయడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

- Advertisement -

ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగుతోంది. కారు పార్టీ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపెడుతోందనే ఆరోపణ ఉంది. ఇలాంటి సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం.. పెద్ద మొత్తంలో డబ్బు పట్టుపడినట్టు తెలుస్తుండటం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News