Jagga Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాకనే అందరికి స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని అపొజిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. దీనికి సాక్ష్యం మీడియా నే అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తిచేసుకందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రుల వెయ్యి రోజుల పాలన హ్యాపీ గా ఉందన్నారు. రాహుల్ గాంధీతో అనేక పథకాలు చెప్పించారు. అనేక పథకాలు అమలు అవుతున్నాయి,. ప్రజలు ఆస్వాదిస్తున్నారని అన్నారు. Ysr తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ brs హయాంలో కనుమరుగు అయ్యిందని అన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చాక పది లక్షల ఆరోగ్య శ్రీ అమలు అవుతుందని, రైతు ఋణమాపి అందరికి కాలేదు అని ప్రచారం ఉందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Also read: టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?
కాంగ్రెస్ పార్టీపై పై కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జగ్గారెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటిఆర్ కోరికలు ఉన్నోడు ఆశలు ఉన్నోడు. కేటిఆర్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీమంత్రి రాహుల్ గాంధీ కుటుంబం మీకు ఏమి అన్యాయం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ కోసం ఒక రాష్ట్రాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ముందు కేటిఆర్ ఆలోచించాలన్నారు. పద్దతి గల కుటుంబాన్ని పద్ధతి లేని కుటుంబం తిట్టడం ఏంటి? ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలిలో ఎవరు చనిపోలేదు. రాష్ట్ర విభజన చేయకపోతే చేయాలని అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. రాష్ట్రం ఇస్తే మేము కాపలా కుక్కలాగా ఉంటాం మాకు పదవులు వద్దు అని మీరే అన్నారు. ఇప్పుడు పదవులు లేక పోయే సరికే చేరువులో చేపల్లాగా గిలాగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా వేశారు.
Also read: పవన్ కల్యాణ్ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!