E-Paper
Advertisement

Kaleshwaram Project Investigation: పైసలు.. ప్రశ్నలు.. కాళేశ్వరం కమిషన్ దూకుడు..!

Kaleshwaram Project Investigation: పైసలు.. ప్రశ్నలు.. కాళేశ్వరం కమిషన్ దూకుడు..!
Advertisement

– కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ
– ఘోష్ కమిషన్ ముందుకు పది మంది ఐఏఎస్‌లు, మాజీలు
– ప్రాజెక్టు నిర్మాణాలు, నిర్ణయాలు, విధానాలపై ప్రశ్నలు
– వారం రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు

Justice Chandra Ghose Commission Speed Up Investigation on Kaleshwaram Project: కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరుపుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఈ క్రమంలోనే పది మంది ఐఏఎస్‌లు, మాజీలను విచారించింది. ప్రస్తు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరు కాగా, వివరాలను అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది కమిషన్. అయితే, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తనకు సమయం కావాలని ఆయన కోరారు. దానికి అంగీకరించిన కమిషన్, ఆగస్టు 5 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది.

Advertisement

బీఆర్కే భవన్‌లో జరిగిన ఈ విచారణకు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్, జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. నిర్మాణ లోపాలపై పలు ప్రశ్నలు సంధించింది. విచారణకు సంబంధించి విద్యుత్ ఉద్యోగి కంచెర్ల రఘు మాట్లాడుతూ, మూడు అంశాలు కమిషన్ ముందు చెప్పడం జరిగిందని అన్నారు. తుమ్ముడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, మూడు బ్యారేజీల నిర్మాణ అంశాలు, పంపు హౌజ్‌ల నిర్మాణాలపై మాట్లాడినట్టు చెప్పారు.

‘‘రీ డిజైనింగ్ పేరుతో తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం బ్లండర్ తప్పిదమని మేము గుర్తించాం. మేడిగడ్డ దగ్గర నిర్మించినప్పటికీ ఎల్లంపల్లి వరకు ఎలాంటి ఆయకట్టు లేదు. ఈ మూడు అంశాలపై సాక్ష్యాధారాలను కమిషన్‌కు అందించాం. డీపీఆర్ అప్రూవల్ కాకుండానే మూడు బ్యారేజీలు నిర్మించారు. అదికూడా సరైన స్థలంలో నిర్మించలేదు. నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయి. కాళేశ్వరంలో టెండర్లు నిబంధనలకు అనుకూలంగా జరగలేదు.

Advertisement

Also Read: గొర్రెల స్కాంలో.. కేటీఆర్ పీఏ..!?

బ్యారేజీల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నష్టం జరిగింది. పంపు హౌస్‌ల నిర్మాణంలో కూడా తప్పిదాలు ఉన్నాయి. మునిగిపోవడానికి నిర్మాణ లోపాలే కారణం. సాక్ష్యాదారాలన్నీ జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అందించా. ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన తరువాత మరొకసారి పిలుస్తామని కమిషన్ చెప్పింది’’ అని వివరించారు రఘు.

Tags

Related News

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×