E-Paper
Advertisement

అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha: వికారాబాద్ జిల్లా పరిగిలో భూసేకరణకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను అడ్డుకునే వరకు విశ్రమించేది లేదని ఆమె హెచ్చరించారు. బుధవారం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి బాధిత రైతులతో ఆమె ధర్నాకు దిగారు.

పరిగి మండలంలోని కళ్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల్లో పరిశ్రమల కోసం 1250 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీనికి వ్యతిరేకంగా సుమారు నాలుగు గంటల పాటు నడిఎండలో కవిత రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి ఆందోళన విరమించాలని కోరగా, “భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు.. మీరే స్వయంగా వచ్చి వారి అభ్యంతరాలు వినాలి” అని ఆమె స్పష్టం చేశారు. కలెక్టర్ నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. అనంతరం పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి బంటారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.

ప్రభుత్వం సేకరిస్తున్న 1250 ఎకరాల్లో 1000 ఎకరాలు అసైన్డ్ భూములేనని, మిగిలినవి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవేనని కవిత పేర్కొన్నారు. “చిన్న, సన్నకారు రైతుల నోటికాడి బుక్కను లాక్కోవడమే కాంగ్రెస్ లక్ష్యమా?” అని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాం కంటే దారుణంగా నేడు రైతుల పరిస్థితి తయారైందని, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి మళ్లీ మూసీని కలుషితం చేస్తారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, త్వరలోనే తెలంగాణకు రాబోయే ప్రాంతీయ పార్టీ ద్వారా మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు.

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని కవిత ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించి దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఉన్న 3.13 శాతం ప్రాతినిధ్యాన్ని పెంచాల్సింది పోయి, తగ్గించాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. తెలంగాణ రాజకీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని ఆమె పిలుపునిచ్చారు.

Read Also: ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే.. ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×