E-Paper
Advertisement

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?
Advertisement

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై చెక్‌డ్యాంలు వరుసగా కూలిపోవడాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నవంబర్‌ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ కూలిపోగా.. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మానేరుపై ఈ చెక్‌డ్యాం నిర్మించగా నిన్న తెల్లవారుజాముు సుమారు 120 మీటర్ల మేర ధ్వంసమైంది. అయితే ఈ డ్యామ్.. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్యాం కూలిపోయిందన్న సమాచారంతో అడవి సోమన్‌పల్లికి చెందిన రైతులు.. చెక్‌డ్యాంను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నామన్నారు అన్నదాతలు. భారీ వరదలు వచ్చినప్పుడు కూడా చెక్‌ డ్యాం పటిష్టంగా ఉందని.. కానీ ప్రస్తుతం వరదలేవి లేని సమయంలో ఇలా కూలడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే కొద్దిరోజుల క్రితం చెక్‌డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. చెక్‌డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్‌ ఏఈ నిఖిల్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో భారీ రియల్ మోసం.. కస్టమర్లను నిలువునా ముంచిన మైరాన్ సంస్థ..

Advertisement

2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం 39.82 కోట్ల వ్యయంతో ఈ చెక్‌డ్యాంను నిర్మించింది. 130.78 క్యూసెక్కుల నీటికి అనుగుణంగా నిర్మించారు. అయితే 2023లో 131.400 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి చెక్‌ డ్యాం ఎడమ వైపు రిటైనింగ్ వాల్, కట్‌ ఆఫ్ వాల్‌ దెబ్బతిన్నది. దీనికి అప్పట్లో నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేశారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×