Big Stories

YS Sharmila : మునుగోడు ఉప్పఎన్నికంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

YS Sharmila : తెలంగాణలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుండగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కుమార్తె కవితను లిక్కర్ కుంభకోణం నుంచి కాపాడటానికే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని అన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటను మాత్రమే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. వేరే జిల్లాల ప్రజలు టీఆర్ఎస్‌కు వోటో వేయలేదా అని ప్రశ్నించారు.

- Advertisement -

మునుగోడు ఎన్నికలతో సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని వైఎస్ శర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు తన పాలనపైన నమ్మకం లేదు కాబ్బట్టే మునుగోడు ఎన్నికలకు భయపడుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంగే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. బోధన్ పట్టణంలో పాదయాత్ర జరుగుతుండగా ఆమె ఈ ప్రసంగం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News