E-Paper
Advertisement

KCR : బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. ఢిల్లీలో కార్యాలయం సిద్ధం..

KCR : బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. ఢిల్లీలో కార్యాలయం సిద్ధం..

KCR News Today(BRS Party Latest News) : బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వరుసగా సభలు నిర్వహించారు. అక్కడ జరగబోయే జెడ్పీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇక కారు నేషనల్ హైవేపై వేగం దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 4న కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం ఢిల్లీకి కేసీఆర్ వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఢిల్లీ కేంద్రంగా ఇక నుంచి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. పార్టీ కార్యాలయం కోసం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఢిల్లీకి వెళ్లారు.

ఢిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి దేశ రాజధాని నడిబొడ్డున బీఆర్ఎస్ సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులను సంతోష్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×