E-Paper
Advertisement

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..
Advertisement

KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది.

Advertisement

ఆషాఢమాసంలో దేవతలను పూజించే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు భారీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×