BigTV English

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు.


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది.

ఆషాఢమాసంలో దేవతలను పూజించే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు భారీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×