E-Paper
Advertisement

Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్

Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్

Vijayan:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. మోదీ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశానికి ఓ దిక్సూచి లాంటిదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. కంటి వెలుగు అద్భుతమైన పథకం అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ యుద్ధానికి తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×