E-Paper
Advertisement

ప్రిన్సిపాళ్ల మధ్య ఈగో వార్.. రోడ్డున పడ్డ 200 మంది విద్యార్థినులు, అసలేం జరిగిందంటే?

ప్రిన్సిపాళ్ల మధ్య ఈగో వార్.. రోడ్డున పడ్డ 200 మంది విద్యార్థినులు, అసలేం జరిగిందంటే?
Advertisement

KGBV protest: విద్యాబుద్ధులు నేర్పి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల ఈగో.. వందలాది మంది పేద విద్యార్థినుల జీవితాలను నడిరోడ్డుపైకి నెట్టింది. అధికారుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి, చివరికి సుమారు 200 మంది విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించేలా చేసింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వివాదానికి కారణం ఏంటి?
అసలు ఈ గొడవకు ప్రధాన కారణం వట్‌పల్లి కేజీబీవీకి సొంత భవనం లేకపోవడమే. వట్‌పల్లి పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించకపోవడంతో, గత కొంతకాలంగా ఆ విద్యార్థినులను కూడా ఆందోల్ కేజీబీవీ భవనంలోనే ఉంచి విద్యాబోధన అందిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు వేర్వేరు పాఠశాలల విద్యార్థినులు, ఇద్దరు ప్రిన్సిపాళ్లు ఉండటంతో మొదటి నుంచి ఇక్కడ అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వసతుల కల్పన, నిర్వహణ విషయంలో ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య సఖ్యత లేకపోవడం.. రోజురోజుకూ వారి మధ్య అహాన్ని పెంచేసింది.

Advertisement

నువ్వెంత అంటే నువ్వెంత.. నలిగిపోయిన విద్యార్థినులు
గత కొద్దిరోజులుగా ఈ ఇద్దరు అధికారుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే వట్‌పల్లి కేజీబీవీకి చెందిన విద్యార్థినులను ఆందోల్ కేజీబీవీ సిబ్బంది, ప్రిన్సిపాల్ తక్కువ చేసి చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమను తీవ్రంగా అవమానిస్తున్నారని, చిన్నచూపు చూస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల మధ్య ఉన్న ఈగో పోరాటంలో తాము బలైపోతున్నామని, కనీస సౌకర్యాలు పొందడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు కన్నీరుమున్నీరయ్యారు.

తల్లిదండ్రుల ముందే కన్నీళ్లు.. నడిరోడ్డుపై ధర్నా!
తాజా పరిణామాల నేపథ్యంలో వట్‌పల్లి విద్యార్థినులను ఆందోల్ కేజీబీవీ భవనం నుంచి బయటకు పంపించేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక, ఆందోళన చెందిన విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రుల ముందే విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు జరుగుతున్న అవమానాలకు నిరసనగా, న్యాయం చేయాలంటూ సుమారు 200 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలి బయటకు వచ్చి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. రహదారిపైనే కూర్చుని తమకు రక్షణ, న్యాయం కావాలంటూ నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

అధికారుల స్పందన కరవు.. విద్యార్థుల భవిష్యత్తేమిటి?
పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్య, వసతి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేస్తే.. ఇక్కడి అధికారుల తీరు ఆ ఆశయాన్ని నీరుగారుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున బాలికలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా, ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి వివాదాన్ని పరిష్కరించకపోవడంపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని, వట్‌పల్లి విద్యార్థినులకు శాశ్వత పరిష్కారం చూపాలని.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.

Also Read: యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

Related News

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

రూ. 100 కోసం ఇంత నీచమా? ర్యాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన యువతి.. వీడియో వైరల్

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు కాలేజీలకు సెలవు.. ఎందుకంటే?

రైలు దూసుకొస్తుంటే ధైర్యం చాలలేదు.. షాబాద్ ఆరుగురి హత్యల నిందితుడి ఊహించని ట్విస్ట్!

పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపెట్టె మర్చిపోయారు.. హరీష్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు!

Addanki Dayakar: నీకేమైనా మెంటల్ ఎక్కిందా అంటూ.. హరీష్ రావుపై అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్!

కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం

Big Stories

Advertisement
×