E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy : ఢిల్లీలో తెలంగాణ భవన్ లేకపోవడం విచారకరం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి..

Komatireddy Venkat Reddy : ఢిల్లీలో తెలంగాణ భవన్ లేకపోవడం విచారకరం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి..

Komatireddy Venkat Reddy : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవనాన్ని నిర్మిస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉమ్మడి ఏపీకి సంబంధించిన పలు ఆస్తులను పరిశీలించారు. ఆ ఆస్తులపై అధికారులను ఆరా తీశారు. 19 బ్లాక్ల్ ల వివరాలను అధికారులు మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు.

అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ దేశ రాజధానిలో తెలంగాణ భవన్ లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావస్తున్నా తెలంగాణ భవన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తానన్నారు.

రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రత్యేక హోదా కల్పించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాకు తన మద్దతు ఉంటుందని అందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×