E-Paper
Advertisement

Mulugu news: బ్రిడ్జి కూలి 8మంది మృతి.. ముందే హెచ్చరించిన బిగ్ టీవీ..

Mulugu news: బ్రిడ్జి కూలి 8మంది మృతి.. ముందే హెచ్చరించిన బిగ్ టీవీ..
BIG TV on Mulugu latest news

Mulugu latest news(Breaking news updates in telangana):

ములుగు జిల్లాలోని జంపన్న వాగు. కొండాయి దగ్గర వాగుపై ప్రమాదకరరీతిలో బ్రిడ్జి ఉంది. కొండాయి బ్రిడ్జ్‌ కూలిపోయే పరిస్థితిపై.. జూలై 22న బిగ్ టీవీ జనతా గ్యారెజ్‌లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. తగు చర్యలు తీసుకోమని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తోలుమందం అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కొండాయి బ్రిడ్జిని మరమ్మత్తులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఫలితం.. తాజా వరదలకు బ్రిడ్జి కుప్పకూలిపోయింది. 8మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

ఎంత దారుణం? ఎంతటి నిర్లక్ష్యం? ఆ బ్రిడ్జి ప్రమాదంలో ఉందని బిగ్ టీవీ ముందే హెచ్చరించినా పట్టించుకోలేదు పాలకులు. ప్రజలంటే, వారి ప్రాణాలంటే అంతటి చిన్నచూపు వారికి. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు.

భారీ వరదకు కొండాయి బ్రిడ్జ్‌ కూలింది. వంతెన కూలటంతో 8 మంది గల్లంతయ్యారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఒకరి గల్లంతయ్యారు. వంతెన కూలడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.

బిగ్ టీవీలో ఆ బ్రిడ్జిపై ప్రత్యేక కథనం ప్రసారమైన వారానికే ఈ ప్రమాదం జరిగింది. బిగ్‌ టీవీ హెచ్చరికతోనైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి ఉంటే బాగుండేది. కనీసం రాకపోకలు నిషేధించినా ముప్పు తప్పేది. ఇప్పుడు ఇంతటి ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు.

సర్కారు ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం ఇప్పుడు జనం ప్రాణాలను తీసింది. మరి, ఈ మృత్యుఘోషకు కారకులెవరు? పట్టించుకోని ప్రభుత్వమా? చేతకాని అధికారులా? బిగ్ టీవీ నిగ్గదీసి అడుగుతోంది. సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది?

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×