KTR PA: కేటీఆర్ పిఏ మహేందర్ రెడ్డి, పిఆర్ఓ మహేష్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం చేయాలనుకుంటున్న పోలీసులు వారిద్దరిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. Ktr పిఏ pro లను సీన్ రీకన్స్ట్రక్షన్కి సైఫాబాద్ పోలీసులు తీసుకెల్లారు.
అయితే అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద మొదటి రోజు జరిగిన ఘర్షణ వాతావరణంపై పూర్తి వివరాలను కేటీఆర్ పిఎ, పిఆర్ఓ లను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. దుర్భాషలాటలు, దూషణలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ కేటీఆర్ పిఏ, పిఆర్వోలను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు వివరాలను పోలీసులు రాబట్టారు. దీంతో వీరిద్దరి విచారణ అనంతరం పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు కేటీఆర్ పీఏ, పీఆర్వోలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు.
Also read: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!
దీనిలో భాగంగా మొదట నోటీసులు ఇవ్వాలని న్యాయవాదులు పోలీసుల మద్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎదుట ఘటన ఎలా జరిగిందనే కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్లోకి తీసుకెల్లనున్నట్టు పోలీసులు అతని తరుపు న్యాయవాదులకు తెలిపారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. హై కోర్ట్ ఆదేశాలకు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని న్యాయవాదుల ఆరోపణలు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి అక్కడి వరకు నడుచుకుంటూ వస్తామని కేటీఆర్ పిఏ, పిఆర్ఓ లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు న్యాయవాదులు నిందితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సైఫాబాద్ పీఎస్ నుండి కేటీఆర్ పీఏ, పిఆర్వో లను సీన్ రీ కన్స్ట్రక్షన్కి పోలీసులు తీసుకెల్లారు. దీంతో పోలీసుల పైన దురుసుగా కేటీఆర్ పిఎ దూషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also read: గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!