Nalgonda Accident: నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండల పరిధిలోని వైజాగ్ కాలనీ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులో ఆకతాయిలు అతివేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపారు. దీంతొ కారు అదుపు తప్పి కిందపడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపుగా కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలైనట్టు సమాచారం.
అయితే అక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన నేరడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ ప్రాంతంలోని సమీపంలో కొంతమంది ఆకతాయిలు కారులో వేగంగా ప్రయాణిస్తున్నారు. కారులో అతివేగంతో పాటు ఇష్ట్రా రాజ్యంగా వాహనాన్ని నడపినటక్టు అక్కడి స్థానికులు తెలిపారు. కారులో డ్రైవర్ నియంత్రణ కోల్పోడంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి కింద పడిపోయింది. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Also read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!
ఈ ప్రమాదం జరిగే సమయంలో కారులో మొత్తం ఏడుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నట్టు అక్కడి స్ధానికులు గుర్తించారు. అదృష్టవశాత్తూ కారు బోల్తా పడినప్పటికీ పెద్ద ప్రమాదం అందూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరకి స్వల్ప గాయాలైనట్టు అక్కడి స్థానికులు తెలిపారు.
Also read: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!