E-Paper
Advertisement

KTR: బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారంకు తప్పకుండా బుద్ధి చెబుతామని చెప్పారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించినప్పటికీ పార్టీని వీడారని అది ఆయనకే నష్టం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి తరువాత పార్టీని వీడటం కార్యకర్తను బాధించిందని తెలిపారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్‌ను పట్టించుకున్న వారే లేరని అన్నారు.

Advertisement

రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందని అన్నారు. మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో పోచారంను ఖచ్చితంగా ఓడిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు సహా.. బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని అన్నారు.

Also Read: ప్రజాస్వామ్యంలో మీది మాది అనేది ఉండదు: హరీశ్ రావుకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని అన్నారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండాపై గెలిచిన పోచారం శ్రీనివాస్ పార్టీ వీడినా.. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు తెలిపారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×