E-Paper
Advertisement

KTR: బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారంకు తప్పకుండా బుద్ధి చెబుతామని చెప్పారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారితో మాట్లాడారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించినప్పటికీ పార్టీని వీడారని అది ఆయనకే నష్టం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి తరువాత పార్టీని వీడటం కార్యకర్తను బాధించిందని తెలిపారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్‌ను పట్టించుకున్న వారే లేరని అన్నారు.

Advertisement

రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందని అన్నారు. మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో పోచారంను ఖచ్చితంగా ఓడిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ సీనియర్ నేతలు సహా.. బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని అన్నారు.

Also Read: ప్రజాస్వామ్యంలో మీది మాది అనేది ఉండదు: హరీశ్ రావుకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని అన్నారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండాపై గెలిచిన పోచారం శ్రీనివాస్ పార్టీ వీడినా.. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు తెలిపారు.

Related News

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

Big Stories

Advertisement
×