BigTV English

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..

Hanmaonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ.. కారును ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన వీరంతా.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిథికి గురువారం రాత్రి కారులో బయల్దేరారు. పెంచికల్ పేట వల్ల ఎదురుగా వస్తోన్న లారీ అదుపుతప్పి వీరి కారును ఢీ కొట్టింది.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను.. మంతెన కాంతయ్య(72), శంకర్ (68), భరత్(29), మంతెన చందన(16)గా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరునాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో స్టూడెంట్ డెడ్‌బాడీ

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Big Stories

×