BigTV English

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..

Hanmaonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ.. కారును ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన వీరంతా.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిథికి గురువారం రాత్రి కారులో బయల్దేరారు. పెంచికల్ పేట వల్ల ఎదురుగా వస్తోన్న లారీ అదుపుతప్పి వీరి కారును ఢీ కొట్టింది.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను.. మంతెన కాంతయ్య(72), శంకర్ (68), భరత్(29), మంతెన చందన(16)గా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరునాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×