Medchal News: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. మాజీ డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని, ఎప్పటికీ ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు రమేష్,నాయకులు దుర్గం శంకర్,సంతోష్ గౌడ్,మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ,వేముల శ్రీనివాస్ రెడ్డి,కౌడె మహేష్,ఆనంద్, కుమార్,రామకృష్ణ,శిరీష శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gopalapuram Politics: గోపాలపురంలో కలకలం రేపుతున్న జనసేన ఇంచార్జ్ ఆరోపణలు