BigTV English

Minister Komati Reddy: ఆర్‌ఆర్ఆర్‌పై నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు: మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy: ఆర్‌ఆర్ఆర్‌పై నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు: మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారుల మంజూరీ, రీజినల్ రింగ్ రోడ్డుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీఫ్, సెక్రెటరీ, స్పెషల్ సెక్రటరీ, ఎన్.హెచ్. ఉన్నతాధికారుల బృందం ఉన్నారు.


మొదటి నితిన్ గడ్కరితో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డుపై విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం లభించేలా చూడాలని మంత్రి కోరారు. రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వపనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (NH-765), పర్వత్ మాల పథకం క్రింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీ, సీఆర్ఐఎఫ్ సేతుబంధు పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీ, NH 65 లోని హైదరాబాద్-విజయవాడ విభాగం 6 లేనింగ్ ,NH 163 లోని హైదరాబాద్ – మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడం.. ఈ 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్ధనలను నితిన్ గడ్కరీ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ స్థితిగతులను నితిన్ గడ్కరీకి వివరించారు.


ఉత్తర భాగానికి సంబంధించి PPPAC (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ అప్రైసల్ కమిటీ)& కేబినెట్ ఆమోదంపై కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం, అటవీ అనుమతులను వేగవంతం చేయాలని మంత్రి అభ్యర్థించారు. దక్షిణ భాగానికి సంబంధించి చౌటుప్పల్ (NH 65 పై) – అమంగల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి (NH 65 పై) మీదుగా నిర్మిస్తున్న RRR దక్షిణ భాగం అలైన్ మెంట్ ను ఫైనలైజ్ ప్రకటన చేస్తూ.. ఆమోదం తెలుపవలసిందిగా కోరారు.

హైదరాబాద్-శ్రీశైలం (NH-765) ఎలివేటెడెట్ కారిడార్

హైదరాబాద్-శ్రీశైలం (NH-765) 187 కిలోమీటర్ల రహదారిలో 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్ నిర్మాణంపై కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళుతుండటంతో.. అటవీ అనుమతుల కారణంగా అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. దక్షిణ కాశీగా, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ను ప్రతిపాదించిన విషయాన్ని గడ్కరీకి గుర్తు చేశారు. మోర్త్ (MoRTH – Ministry of Road Transport and Highways) సూచనల మేరకు టైగర్ రిజర్వ్ అధికారుల అనుమతి కూడా కోరారు.

మోర్త్ సూచనల ప్రకారం అటవీ అనుమతుల కోసం పరివేష్-2.0లో దరఖాస్తు చేయడం తదుపరి పురోగతిపై గడ్కరీకి వివరించారు. వీటన్నింటి దృష్ట్యా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌ ప్రగతిలో ఆలస్యం జరగకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచేందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించించినట్లు మంత్రి తెలిపారు. పర్వత్ మాల పథకం కింద్ర 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీకై వినతి చేశారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశాలకు రోప్‌వే కనెక్టివిటీ అభివృద్ధి కోసం పర్వతమాల పథకాన్ని ప్రవేశపెట్టిందని.. అయితే, ఈ పథకంలో తెలంగాణకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు కాలేదని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.

పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాన్ని అందించేందుకు (1) యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి (2 కి.మీ) రోప్‌వే, (2) భువనగిరి కోటకు (1 కి.మీ) రోప్‌వే, (3) నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ (2 కి.మీ) రోప్‌వే, (4) నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా (5 కి.మీ) నాగార్జునకొండను కలుపుతూ రోప్‌వే. (5) మంథనిలోని రామగిరి కోట (2 కి.మీ) రోప్‌వే వంటి 5 రోప్ వే ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరీ చేయాలని మంత్రి కోరారు.

CRIF-సేతుబంధన్ పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీకై వినతి

CRIF-సేతుబంధు పథకం క్రింద రూ. 887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరీ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి  రాసిన లేఖను నితిన్ గడ్కరీకి గుర్తు చేశారు. ఇప్పటికి ఆ అభ్యర్ధనలు పెండింగ్ లో ఉండటంతో తాను మరో అభ్యర్ధన లేఖను నితిన్ గడ్కరీకి అందజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్ పథకం కింద ప్రతిపాదిత 12 పనులను మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

హైదరాబాద్-విజయవాడ NH 65 ను 6 లేన్లుగా విస్తరణకై వినతి

రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన NH-65పై ట్రాఫిక్ 40,000 ప్యాసింజర్ కార్ యూనిట్ గా ఉండటం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా NH-65 ని 6 లేన్లుగా విస్తరించాలని నితిన్ గడ్కరీకి వివరించారు. NH-65ని (హైదరాబాద్-విజయవాడ) 6 లేన్లుగా నిర్మించేందుకు ఉద్దేశించిన DPR తయారీని వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు. అంతేకాదు, NH-163 లోని హైదరాబాద్ నుండి మన్నెగూడ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.

అనంతరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు.

మామునూరు ఎయిర్ పోర్ట్ మంజూరీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణకు 205 కోట్ల రూపాయలను మంజూరీ చేసి భూసేకరణ చేస్తున్న విషయం రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా మామునూర్ ఎయిర్ పోర్టును పూర్తి చేసేలా చూస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దశాబ్ధ కాలంగా పెండింగ్ లో ఉన్న ఎయిర్ పోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే కార్యరూపం దాల్చిందని చెప్పారు.

మామునూరు ఎయిర్ పోర్టు కు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు కోసం జిఎంఆర్ నుంచి NOC తీసుకున్నామని పేర్కొన్నానరు. రెండున్నరేళ్లలో మామునూర్ ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్ధనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు.

త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన IMD సర్వే పూర్తి చేసి ఫీజిబిలిటీ స్టడీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ చేయనుంది. మామునూర్ ఎయిర్ పోర్టుకి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని అన్నారు. మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన ఉన్నారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×