E-Paper
Advertisement

Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..

Rajaiah : బోరున విలపించిన రాజయ్య.. కుట్రలు చేస్తున్నారని ఆవేదన..
Advertisement

Rajaiah : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ మధ్య మీడియాలో హాట్ న్యూస్ అయ్యారు. ఆయనపై సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆమె నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కే ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో రాజయ్య ఈ వివాదాన్ని ముగించేందుకు స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్ పశ్చాతాపాన్ని ప్రకటించారు. క్షమాపణలు కోరారు. గ్రామ అభివృద్ధికి 25 లక్షలు నిధులు ప్రకటించారు. అయినా సరే సర్పంచ్ నవ్యలో కోపం చల్లారలేదు. ప్రెస్ మీట్ లోనే ఎమ్మెల్యేను కడిగేశారు. మరోసారి తన జోలికి వస్తే దారుణ పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు.

ఆ తర్వాత రాజయ్య నవ్య ఇష్యూపై మాట్లాడలేదు. తాజాగా కరుణాపురంలో జరిగి ఫాదర్ కొలంబో జయంతి వేడుకల్లో రాజయ్య పాల్గొన్నారు. ఈ వేడుకలో తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. కొందరు రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అంటూ కంటతడిపెట్టారు. 63 ఏళ్ల వయసున్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

దమ్ముంటే ఫేస్‌ టూ ఫేస్‌ రాజకీయాలు చేయాలని.. తాడోపేడో తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని అందుకే కుట్రతో కొందరు ఇబ్బంది పెడుతున్నారని బోరున విలపించారు. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాను ఆడవాళ్లను గౌరవించే వ్యక్తినని తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని కొలంబో విగ్రహం సాక్షిగా రాజయ్య ప్రతినబూనారు.

Bandi Sanjay : సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్డితో విచారణ జరపండి: బండి సంజయ్..

Advertisement

Kavitha : కవిత న్యాయపోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్..

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×