Kavitha bail petition update(Political news today telangana): మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వాయిదా పడింది. ఈనెల 22 లేదా 23న ఆమె బెయిల్ పిటీషన్పై వాదనలు జరగనున్నాయి.
అంతకుముందు కుమారుడి పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. కాగా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఏప్రిల్ 20న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిస్తామన్నారు. కాగా దాన్ని ఏప్రిల్ 16కు మార్చారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23 విచారణ జరిగే అవకాశముంది.