E-Paper
Advertisement

Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..

Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..
Advertisement

Pawan campaign: తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార డీఎంకె, విపక్ష అన్నాడీఎంకె మధ్య నువ్వానేనా అన్నరీతిలో ఫైట్ సాగేంది. ఇదంతా ఒకప్పుడు.. మోదీ వచ్చాక పరిస్థితి మారింది.
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతీది హైకమాండ్ గమనిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్, దక్షిణ చెన్నై నుంచి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రచారంలో ఆమె కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తమిళిసై తరపున ప్రచారం చేయాలని పవన్‌కల్యాణ్ డిసైడ్ అయ్యారట. రేపో మాపో ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండడంతో తమిళిసై.. పవన్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకు పవన్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. రోడ్ షోతోపాటు బహిరంగ సభకు కూడా పవన్ హాజరుకానున్నట్లు సమాచారం.

Advertisement

ఈ నియోజవకర్గం నుంచి అధికార డీఎంకె నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈమెకు రెండున్నర లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. దానికితోడు ఆమె రచయిత కూడా. తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడం ఆమె సొంతం. పరిస్థితి గమనించిన బీజేపీ, ఇక్కడి నుంచి తమిళిసైను రంగంలోకి దింపింది. తమిళిసై.. డీఎంకెకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని కమలనాధుల ఆలోచన.

ALSO READ:  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Advertisement

అన్నాడీఎంకె నుంచి మాజీ మంత్రి జయకుమార్ కుమారుడు జయవర్థన్ రేసులో ఉన్నారు. 2009, 2014 జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకె అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. మరి ముక్కోణపు పోటీలో దక్షిణ చెన్నైపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Big Stories

Advertisement
×