BigTV English
Advertisement

Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..

Pawan campaign: గట్టి పోటీ.. అందుకే, రంగంలోకి పవన్..

Pawan campaign: తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార డీఎంకె, విపక్ష అన్నాడీఎంకె మధ్య నువ్వానేనా అన్నరీతిలో ఫైట్ సాగేంది. ఇదంతా ఒకప్పుడు.. మోదీ వచ్చాక పరిస్థితి మారింది.
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతీది హైకమాండ్ గమనిస్తోంది.


ముఖ్యంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్, దక్షిణ చెన్నై నుంచి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రచారంలో ఆమె కాస్త వెనుకబడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తమిళిసై తరపున ప్రచారం చేయాలని పవన్‌కల్యాణ్ డిసైడ్ అయ్యారట. రేపో మాపో ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండడంతో తమిళిసై.. పవన్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకు పవన్ ఓకే అన్నట్లు తెలుస్తోంది. రోడ్ షోతోపాటు బహిరంగ సభకు కూడా పవన్ హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ నియోజవకర్గం నుంచి అధికార డీఎంకె నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈమెకు రెండున్నర లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. దానికితోడు ఆమె రచయిత కూడా. తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడం ఆమె సొంతం. పరిస్థితి గమనించిన బీజేపీ, ఇక్కడి నుంచి తమిళిసైను రంగంలోకి దింపింది. తమిళిసై.. డీఎంకెకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని కమలనాధుల ఆలోచన.


ALSO READ:  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అన్నాడీఎంకె నుంచి మాజీ మంత్రి జయకుమార్ కుమారుడు జయవర్థన్ రేసులో ఉన్నారు. 2009, 2014 జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకె అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. మరి ముక్కోణపు పోటీలో దక్షిణ చెన్నైపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×