BigTV English

UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC Results Released : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీ వాత్సవకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రదాన్ కు రెండో ర్యాంక్, దోనూరు అనన్యారెడ్డికి మూడవ ర్యాంక్ వచ్చింది. పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కు నాల్గవ ర్యాంక్, రుహానీకి ఐదవ ర్యాంక్ వచ్చింది.


1016 మంది ఉత్తీర్ణులు అవ్వగా.. 347 మందిని జనరల్ కేటగిరీలో, 303 మందిని ఓబీసీ కేటగిరీలో, 165 మందిని ఎస్సీ కేటగిరీలో, 86 మందిని ఎస్టీ కేటగిరీలో ఎంపిక చేశారు. అభ్యర్థులు ఫలితాలను upsc.gov.in, upsconline.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్ లో 15,16,17,23,24 తేదీల్లో జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 8న వీటి ఫలితాలు రాగా.. ఉత్తీర్ణులైన అభ్యర్థులను జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా ఇంటర్వ్యూలు చేసింది యూపీఎస్సీ బోర్డు.


తాజాగా ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినవారి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఐపీఎస్ కు200, ఐఏఎస్ కు 180, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. వీరిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాలతో పాటు.. ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తుంది.

 

 

 

 

 

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×