E-Paper
Advertisement

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? అని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు ప్రమాద విషయంపై వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ చేసి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులోని 37 మంది ప్రయాణికుల్లో దాదాపు 15 మంది వరకు టీచర్లు ఉండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. క్షత్తగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశించారు.

Also Read: Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వ అనైతిక చర్యల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన 317 జీవో ప్రకారం అదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారని, వీరంతా విధినిర్వహణలో భాగంగా రోజుకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించాల్సి వస్తోందన్నారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్ద బస్సు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న వాగులో పడిపోయిందని, ఈ ప్రమాదంలో విధులకు వెళ్తున్న వారిలో దాదాపు 15 మంది టీచర్లు ఉండటం బాధాకరమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొమురయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీవో 190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు చేపట్టాలన్నారు.

Also Read: Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×