E-Paper
Advertisement

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Advertisement

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? అని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈమేరకు ప్రమాద విషయంపై వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ చేసి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సులోని 37 మంది ప్రయాణికుల్లో దాదాపు 15 మంది వరకు టీచర్లు ఉండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. క్షత్తగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశించారు.

Also Read: Maoist Surrender: అడవి బాట వీడిన మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు.. తెలంగాణలో ముగిసిన సాయుధ పోరాటం

190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు

Advertisement

రాష్ట్ర ప్రభుత్వ అనైతిక చర్యల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన 317 జీవో ప్రకారం అదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారని, వీరంతా విధినిర్వహణలో భాగంగా రోజుకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించాల్సి వస్తోందన్నారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ వద్ద బస్సు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న వాగులో పడిపోయిందని, ఈ ప్రమాదంలో విధులకు వెళ్తున్న వారిలో దాదాపు 15 మంది టీచర్లు ఉండటం బాధాకరమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొమురయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీవో 190 ప్రకారం పదోన్నతులు, తాత్కాలిక బదిలీలు చేపట్టాలన్నారు.

Also Read: Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×