E-Paper
Advertisement

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో బాల్క సుమన్ భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమన్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. తమకు ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నువ్వు మళ్లీ చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది’ అంటూ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవించక తప్పదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిని అణచివేయాలని చూస్తే సహించేది లేదని వివరించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

డీజీపీ శివధర్ రెడ్డి తీరును సైతం కేటీఆర్ తప్పుబట్టారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో డీజీపీ సినిమా డైలాగులు కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్.. పింక్ బుక్ ఉండవని.. కేవలం ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినా.. వారి బట్టలు ఊడదీసి కొడతామని బెదిరించినా కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. అధికార పక్షానికి ఒక నీతి.. ప్రతిపక్షానికి మరో నీతా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని హితవు పలికారు.

కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని.. న్యాయాన్ని తుంగలో తొక్కి పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును గమనిస్తున్నామని.. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తమ చర్యలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం తగదని సూచించారు.

Advertisement

రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని శిక్షిస్తామని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ ప్రకటించారు.

ALSO READ: Devji alias Tippiri Tirupati: వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదు.. లొంగుబాటు అనంతరం దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×