E-Paper
Advertisement

Moinabad Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

Moinabad Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
Advertisement

Moinabad Drugs Case: స్వేచ్ఛ బ్యూరో: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. పార్టీ కోసం డ్రగ్స్ సప్లయ్ చేసిన సప్లయర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఇటీవల ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తోపాటు మొత్తం 11మందిపై కేసులు నమోదయ్యాయి.

డ్రైవర్ సిల్వెరీ శరత్..

పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలు జైలుకు రిమాండ్ కాగా మిగితా నిందితులు స్టేషన్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కౌశిక్ ను విచారించినపుడు కొకైన్ ను సిమ్లా నుంచి తెచ్చినట్టు చెప్పటంతో అధికారులు మొదట ఆ కోణంలో విచారణ జరిపారు. అయితే, పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వెరీ శరత్ ను ప్రశ్నించినపుడు నిజానికి కొకైన్ ను అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి ఓఆర్ఆర్ వద్ద కొకైన్ కొన్నట్టు వెల్లడించాడు. దాంతో అధికారులు అభిషేక్ సింగ్ కోసం గాలింపు మొదలు పెట్టారు.

Advertisement

Also Read: Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు?

మొబైల్ నెంబర్ ఆధారంగా చివరకు అభిషేక్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లయ్ చెయ్యటం ఇదే మొదటిసారి కాదని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులకు గతంలో అతను డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అతని నుంచి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు? పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్నిసార్లు డ్రగ్స్ ఇచ్చాడు? అన్నదానిపై ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Also read: Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×