E-Paper
Advertisement

Trump Warning to Iran: హర్మూజ్‌ జలసంధి ఇష్యూ.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు

Trump Warning to Iran: హర్మూజ్‌ జలసంధి ఇష్యూ.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు
Advertisement

Trump Warning to Iran: ఇరాన్ అల్టిమేటం ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తిరిగి తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను నాశనం చేస్తామని బెదిరింపులకు దిగారు. వార్నింగ్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తమపై దాడులు చేస్తే అమెరికా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం, కేవలం 48 గంటలు

Advertisement

ఇరాన్-అమెరికాల మధ్య వార్ తీవ్రరూపం దాల్చింది. హర్మూజ్‌ జలసంధి వద్ద ఆయిల్ నౌకలు వేల సంఖ్యలో నిలిచిపోయాయి. ఫలితంగా ఆసియా, ఐరోపా దేశాల్లో తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. చివరకు చేసేది ఏమీ లేక ట్రంప్‌పై మద్దతుదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు ట్రంప్.

ఈ క్షణం నుండి 48 గంటల్లో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ప్రస్తావించారు. అంతేకాదు ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని అందులోని మొదటి పాయింట్. ఈ విషయంలో ఇరాన్ మొండికేస్తే ఆదేశంలో విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందన్నారు.

Advertisement

హర్మూజ్‌ జలసంధి తెరవకుంటే విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా

వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని, అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుందని హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసి వేసింది. దీంతో అక్కడ వేలాది షిప్ లు ఆగిపోయాయి. ఫలితంగా ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందని ట్రంప్ సూచన చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరిక రావడంతో ఏం జరుగుతుందోనన్న టెక్షన్ వివిధ దేశాలను వెంటాడుతోంది. తమ దేశ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఏ మాత్రం దాడి జరిగినా ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని ఇటీవల ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది.

ALSO READ: ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్,  వాటిపై ప్రధానంగా చర్చ

ఇరాన్ మీడియా ప్రకారం.. ఆదేశ ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటే.. ఈ ప్రాంతంలోని అమెరికాకు చెందిన అన్ని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ఓ ప్రకటన చేశారు. యుద్ధం ఆగాలంటే మూడు షరతులను పెట్టారు.  దానిపై ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో 48 గంటల తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×