E-Paper
Advertisement

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..
Advertisement

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కొడుకులు చనిపోయిన గంటల వ్యవధిలోనే వారి తల్లులు సైతం గుండెపోటుతో మరణించారు. ప్రాంతాలు వేరైనా.. గుండెపోటుకు గురై నలుగురు మృతి చెందడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తల్లీ, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి లక్ష్మి.. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

ఏపీలోని చిత్తూరు నగరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చిత్తూరు నగరంలో కూమారుడు మరణించాడని తల్లి అవేదనతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కట్టమంచికి చెందిన సురేంద్రరెడ్డి(58) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. కుమారుడుడిని అచేనంతగా చూసిన తల్లి సుశీలమ్మ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడి మృతి.. తట్టుకోలేక షాక్ గురై మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరు తల్లులు, ఇద్దరు కొడుకుల మరణాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×