E-Paper
Advertisement

TS Nomination: నామినేషన్ కు ఆలస్యం.. అధికారి కాళ్లు మొక్కిన అభ్యర్థి

TS Nomination: నామినేషన్ కు ఆలస్యం.. అధికారి కాళ్లు మొక్కిన అభ్యర్థి
Advertisement

TS election nomination updates(Telangana news live): గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని అధికారులు లోనికి అనుమతించలేదు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్న కారణంగా..ఆలస్యంగా నామినేషన్ వేయడానికి వచ్చిన దళిత బహుజన పార్టీ అభ్యర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య నామినేషన్ వేయడానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో నోడల్ అధికారి నామినేషన్ వేయడానికి అనుమతించలేదు. నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..మాతంగి హనుమయ్య నోడల్ అధికారి కాళ్లు మొక్కారు. అయినప్పటికీ సదరు అధికారి నామినేషన్ స్వీకరించకపోవడంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగారు.

Advertisement

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు గానూ 547 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 13 న పోలింగ్, జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×