E-Paper
Advertisement

Telangana Politics: కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..

Telangana Politics:  కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..
Advertisement

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల మధ్య మాటల వేడి తీవ్రమైంది. ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ మాటల అస్త్రాలను సంధిస్తోంది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌లో అదే జరుగుతోంది.

కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్

Advertisement

బుధవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన రిప్లై ఇచ్చారు. రోడ్డెక్కమంటూ పార్టీ లీడర్లను కేటీఆర్ బతిమిలాడుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ ఈ స్థాయికి పడిపోవడం దారుణమనేది ఆయన మాట.

బీఆర్‌ఎస్ చచ్చిన శవమని, ఎంత లేపినా లేవదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారని, కేటీఆర్ సోషల్ మీడియాలో ఉంటారని దుయ్యబట్టారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి కార్యకర్తలు బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలో అన్నివర్గాల ప్రజలను మోసపోయారని, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదన్నారు. కేవలం పైశాచిక ఆనందం గురించి మాట్లాడడం సిగ్గుచేటని, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రికి వినోదంగా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే.

ALSO READ: తెలంగాణ SSC ఫలితాల్లో భాష్యం ‘బంపర్’ విక్టరీ.. విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులు!

 

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×