E-Paper
Advertisement

NiranjanReddy: 165 ఎకరాల్లో ఫాంహౌజ్?.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై చెన్నై NGTలో కంప్లైంట్..

NiranjanReddy: 165 ఎకరాల్లో ఫాంహౌజ్?.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై చెన్నై NGTలో కంప్లైంట్..
Advertisement

NiranjanReddy: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆక్రమణలపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా ఆయనపై ఏకంగా హరిత ట్రిబ్యునల్‌లోనే ఫిర్యాదు చేశారు. బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగేంధర్‌గౌడ్ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డి నదీ భూమిని కబ్జా చేశారని.. దానిపై విచారణ జరిపించాలంటూ NGT దృష్టికి తీసుకొచ్చారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్‌ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల ఆరోపించారు. గిరిజనుల పేరిట 7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారని అన్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఎలా కట్టారంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటలను కేబినెట్‌ నుంచి తొలగించారు. ఇప్పుడు నిరంజన్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు ఎందుకని ప్రశ్నించారు.

Advertisement

ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తానెలాంటి కబ్జాలకు పాల్పడలేదని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు.

కట్ చేస్తే.. మేటర్ కేసీఆర్ వరకూ చేరింది. బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో తలాతోక లేనోడు ఆరోపిస్తే.. నువ్ స్పందిస్తావా? నీకేం పనిలేదా? అలాంటి వాటిని పట్టించుకోవద్దంటూ కేసీఆర్ గట్టిగానే క్లాస్ ఇచ్చారు మంత్రి నిరంజన్‌రెడ్డికి.

Advertisement

ఇలా రాజకీయ రచ్చ నడుస్తున్న నేపథ్యంలోనే.. మంత్రి నిరంజన్‌పై బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ NGTలో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×