BigTV English
Advertisement

Operation Gaja: ఆపరేషన్ గజ.. 48 గంటలు బయటకు రావొద్దన్న అధికారులు!

Operation Gaja: ఆపరేషన్ గజ.. 48 గంటలు బయటకు రావొద్దన్న అధికారులు!
Operation Gaja in Komaram Bheem Dist
Operation Gaja in Komaram Bheem Dist

Operation Gaja in Komaram Bheem District: ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా ప్రజలను మదగజం వణికిస్తోంది. గజరాజు సృష్టించిన బీభత్సానికి ఇప్పటికే ఇద్దరు రైతులు మరణించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. బూరేపల్లి, కొండపల్లి గ్రామాల్లో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మరణించారు. ఏనుగు దాడి నేపథ్యంలో ప్రజలను దాని బారి నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చింతలమానేపల్లి, పెంచికల్ పేట, బెజ్జూర్ మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. 48 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు.


గత రాత్రి (ఏప్రిల్ 4, గురువారం) కొండపల్లి మలుపు వద్ద ఒక బస్సుకు ఏనుగు ఎదురుగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెంచికల్ పేట మండలంలోని గ్రామాల్లో గజరాజు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మండలంలోని 12 గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఏనుగు దాడిలో ఎవరూ గాయపడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

Also Read: చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి?


గజరాజును సురక్షితంగా సరిహద్దు దాటించేందుకు “ఆపరేషన్ గజ” చేపట్టారు. ఇందుకోసం 70 మంది అధికారులను రంగంలోకి దించారు. రేయి పగలు తేడా లేకుండా.. రెస్క్యూ టీం ఏనుగు ఆచూకీ కోసం గాలిస్తోంది. కాగా.. ఏనుగుదాడిలో మరణించిన రైతుల కుటుంబాలకు మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×