E-Paper
Advertisement

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar: కేసీఆర్, హరీష్ చెప్పేవన్నీ అబద్దాలే.. ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
Advertisement

Uttam Kumar: గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడం వల్ల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అడ్డంకులను అధిగమించడానికి ప్రాజెక్టును రీ-డిజైన్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై నిజమైన చిత్తశుద్ధి లేదని విమర్శిస్తూ, నిధుల మళ్లింపు, ప్రణాళికా లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (DPR) కోసం జీవో నెంబర్ 69 జారీ చేసి, పనుల్లో పారదర్శకతకు శ్రీకారం చుట్టారు.

అంతేకాకుండా కృష్ణా నది బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణకే ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ, గతంలో సరైన వాటా దక్కలేదని మంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నికర జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 55,080 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ సిద్ధం చేశామని, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ. 10 వేల కోట్ల నిధులను ఈ ప్రాజెక్టు కోసం సమీకరించామని వెల్లడించారు.

Advertisement

ప్రాజెక్టు పరిధిని విస్తరిస్తూ ఆయకట్టును 10 లక్షల ఎకరాల నుండి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం గమనార్హం. దీనివల్ల 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందనుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేవలం సాగునీరే కాకుండా, మొత్తం 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, వికారాబాద్ జిల్లాల రైతులకు పండగలాంటి వార్త ఇది.

Also Read: దమ్ముంటే కొనండి.. లేదంటే మానేయండి! ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ‘టాక్స్’ టెర్రర్

Advertisement

పనుల పురోగతి విషయానికి వస్తే, నార్లాపూర్, ఏదుల, వట్టేం, కరివెన రిజర్వాయర్ల పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావచ్చాయని, కరివెన రిజర్వాయర్ పనులు 75 శాతానికి చేరుకున్నాయని మంత్రి వివరించారు. ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును అన్ని అనుమతులతో, పక్కా ప్రణాళికతో పూర్తి చేసి తీరుతామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

Related News

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Big Stories

Advertisement
×