E-Paper
Advertisement

Liquor Ban: మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజులు వైన్స్ షాప్స్ బంద్

Liquor Ban: మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజులు వైన్స్ షాప్స్ బంద్

Liquor Ban: తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా జరుపుకునే బోనాల పండుగను పురస్కరించుకుని.. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని రాచకొండ కమిషనరేట్ లో పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆయ‌న స్పష్టం చేశారు.

బోనాల పండుగ ప్రత్యేకత
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆత్మీయత కలిగిన పండుగ బోనాలు. ఈ పండుగలో ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, పల్లకీలు, పోతరాజుల ఆటలతో పండుగ ప్రాంతాలన్నీ సందడి చేస్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల రద్దీ, ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ, శాంతిభద్రతలు కాపాడటానికి ముందస్తుగా.. కొన్ని నియమ నిబంధనలు విధించడం సహజం.

మద్యం దుకాణాల మూతపై స్పష్టత
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వచ్చే బోనాల వారాంతానికి సంబంధించి.. మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. ఇందులో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, బీర్ పార్లర్లు, క్లబ్బులు అన్నీ వస్తాయి. ఆదివారం (జూలై 20) ఉదయం 6 గంటల నుండి సోమవారం (జూలై 21) ఉదయం 6 గంటల వరకు వీటిని తెరిచి ఉంచితే, సంబంధిత వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎలాంటి మినహాయింపు లేకుండా, ఈ 24 గంటల నిషేధం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఉల్లంఘనపై కఠిన చర్యలు
ఆదేశాలను పాటించకుండా మద్యం అమ్మిన వారిపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తాయి. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే, మద్యం లైసెన్సు రద్దు, ఫిర్యాదు నమోదు చేయనున్నట్లు, షాప్స్ దుకాణాలు మూసివేత వంటి చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే.. శాంతి భద్రతలు స్థిరంగా కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.

ప్రజలకు పిలుపు
రాచకొండ పోలీసులు ప్రజలను శాంతియుతంగా.. బోనాల పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు. మద్యం సేవించడం వల్ల పండుగలో పాల్గొనే సమయంలో అపాయాలు, గందరగోళం, గొడవలు, రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. ఇది కుటుంబాల ఆనందాన్ని చెడగొట్టే పరిణామాలకు దారితీస్తుంది. అందుకే మద్యం వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

శాంతియుత పండుగకు సహకరించాలి
బోనాల పండుగ రాష్ట్ర సాంస్కృతిక సంపదకు ప్రతీక. ఇది సామాజిక ఐక్యతను, మహిళా భక్తి భావనను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు నిబంధనలు పాటిస్తూ, పూర్తిగా మద్యం విరమణ చేసి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు కానుంది.

Also Read: 17 ఏళ్ల యువతికి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్లు, నిజంగా అద్భుతం

బోనాల పండుగ శుభపర్వదినం అయినందున, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. మద్యం దుకాణాల మూత.. పండుగ సందర్భంలో ప్రజల రక్షణకు గట్టి పునాది అవుతుంది. శాంతియుతంగా, సురక్షితంగా బోనాల పండుగ జరుపుకుందాం.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×