E-Paper
Advertisement

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్
Advertisement

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రేపు ఘట్‌కేసర్, NFC నగర్ వద్ద జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే  సీఎం అధికారులను ఆదేశించారు.

తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన చెరగని ముద్ర వేసిన.. రాష్ట్ర గీతం‘జయ జయహే తెలంగాణ’ రచయిత అయిన కవి అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతితో తెలుగు సాహితీ లోకం ఒక శిఖరాన్ని కోల్పోయిందని పలువురు ప్రముఖులు, అభిమానులు విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జరగనున్న అందెశ్రీ అంత్యక్రియలలో పాల్గొని, దివంగత కవికి తమ అంతిమ నివాళులు అర్పించనున్నారు.

Advertisement

అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో.. సాహిత్య ప్రస్థానంలో అందెశ్రీ పాత్ర చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని అన్నారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అందెశ్రీ పార్థివ దేహానికి అంత్యక్రియలు రేపు ఘట్‌కేసర్ సమీపంలోని NFC నగర్ వద్ద నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, అందెశ్రీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సీఎంతో పాటు అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో పాలుపంచుకొని ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలు పలకనున్నారు.

Advertisement

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తన కలం ద్వారా ప్రతిబింబించిన అందెశ్రీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సాహిత్య విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా.. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ముఖ్యమంత్రి అంతిమయాత్రలో పాల్గొనడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులకు ఇచ్చే గౌరవం మరింత స్పష్టమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు.

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: ప్రధాని మోదీ

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగంలో చెరగని ముద్ర వేసిన కవి, ఉద్యమ గళం అంది శ్రీ అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మట్టి కవి అని కొనియాడారు. ‘అందె శ్రీ అకాల మరణం యావత్తు రాష్ట్రానికే తీరని లోటు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, ఆత్మగౌరవాన్ని తన అక్షరాల్లో బంధించిన గొంతుక. ప్రజా జీవితంలోని కష్టసుఖాలను వారి కవిత్వంలో అద్భుతంగా పలికించిన ఘనత అంది శ్రీ ది. ఆయన రచనలు సామాజిక స్పృహను, అద్భుతమైన భావ సౌందర్యాన్ని మేళవించి, సామాన్యుల హృదయాలను ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు, కవితలు ప్రజలను ఏకం చేయడంలో.. స్ఫూర్తిని నింపడంలో కీలకపాత్ర పోషించాయి. ఆయన సాహిత్యం తరతరాలుగా ప్రజల మనసుల్లో సజీవంగా నిలిచి ఉంటుంది’ అని ప్రధాని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ALSO READ: Bandi Sanjay: గ్రేట్.. 4,847 మంది విద్యార్థులకు అండగా నిలిచిన బండి సంజయ్.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×