BigTV English
Advertisement

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు రేపు ఘట్‌కేసర్, NFC నగర్ వద్ద జరగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే  సీఎం అధికారులను ఆదేశించారు.


తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన చెరగని ముద్ర వేసిన.. రాష్ట్ర గీతం‘జయ జయహే తెలంగాణ’ రచయిత అయిన కవి అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతితో తెలుగు సాహితీ లోకం ఒక శిఖరాన్ని కోల్పోయిందని పలువురు ప్రముఖులు, అభిమానులు విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జరగనున్న అందెశ్రీ అంత్యక్రియలలో పాల్గొని, దివంగత కవికి తమ అంతిమ నివాళులు అర్పించనున్నారు.

అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో.. సాహిత్య ప్రస్థానంలో అందెశ్రీ పాత్ర చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని అన్నారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


అందెశ్రీ పార్థివ దేహానికి అంత్యక్రియలు రేపు ఘట్‌కేసర్ సమీపంలోని NFC నగర్ వద్ద నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, అందెశ్రీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సీఎంతో పాటు అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో పాలుపంచుకొని ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలు పలకనున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తన కలం ద్వారా ప్రతిబింబించిన అందెశ్రీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సాహిత్య విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా.. ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ముఖ్యమంత్రి అంతిమయాత్రలో పాల్గొనడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులకు ఇచ్చే గౌరవం మరింత స్పష్టమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు.

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: ప్రధాని మోదీ

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగంలో చెరగని ముద్ర వేసిన కవి, ఉద్యమ గళం అంది శ్రీ అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మట్టి కవి అని కొనియాడారు. ‘అందె శ్రీ అకాల మరణం యావత్తు రాష్ట్రానికే తీరని లోటు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, ఆత్మగౌరవాన్ని తన అక్షరాల్లో బంధించిన గొంతుక. ప్రజా జీవితంలోని కష్టసుఖాలను వారి కవిత్వంలో అద్భుతంగా పలికించిన ఘనత అంది శ్రీ ది. ఆయన రచనలు సామాజిక స్పృహను, అద్భుతమైన భావ సౌందర్యాన్ని మేళవించి, సామాన్యుల హృదయాలను ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు, కవితలు ప్రజలను ఏకం చేయడంలో.. స్ఫూర్తిని నింపడంలో కీలకపాత్ర పోషించాయి. ఆయన సాహిత్యం తరతరాలుగా ప్రజల మనసుల్లో సజీవంగా నిలిచి ఉంటుంది’ అని ప్రధాని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ALSO READ: Bandi Sanjay: గ్రేట్.. 4,847 మంది విద్యార్థులకు అండగా నిలిచిన బండి సంజయ్.

Related News

Jubilee Hills Byelection: రేపే పోలింగ్.. తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి!

Karimnagar News: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది బాలికలకు అస్వస్థత

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. పోలింగ్‌పై డ్రోన్‌లతో నిఘా: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్.. ఆముదం గింజలతో భారీ కుట్ర!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Big Stories

×