E-Paper
Advertisement

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..
Advertisement

Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్టేషన్ లో రైలు ఆగుతున్న క్రమంలో పట్టాలు తప్పగా.. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఇంజిన్ బలంగా ఢీ కొట్టడంతో రైలు కుదుపులకు గురైంది. రైలులో మూడు బోగీలు పక్కకు ఒరగడంతో.. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

రైలు ప్రమాదంపై అధికారులు అలర్టయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×