E-Paper
Advertisement

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..
Advertisement

Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్టేషన్ లో రైలు ఆగుతున్న క్రమంలో పట్టాలు తప్పగా.. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఇంజిన్ బలంగా ఢీ కొట్టడంతో రైలు కుదుపులకు గురైంది. రైలులో మూడు బోగీలు పక్కకు ఒరగడంతో.. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

రైలు ప్రమాదంపై అధికారులు అలర్టయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×