BigTV English
Advertisement

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..

Charminar Express: నాంపల్లి రైలుప్రమాదం.. బాధితులకు రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా..

Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్టేషన్ లో రైలు ఆగుతున్న క్రమంలో పట్టాలు తప్పగా.. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఇంజిన్ బలంగా ఢీ కొట్టడంతో రైలు కుదుపులకు గురైంది. రైలులో మూడు బోగీలు పక్కకు ఒరగడంతో.. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.


రైలు ప్రమాదంపై అధికారులు అలర్టయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×