Telangana Registrations: కారణాలు ఏమైనా కావచ్చు.. తెలంగాణలో మంగళవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచి పోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీని కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. మంగళవారం ఉదయం నుంచి సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీని ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్లకు వచ్చిన వినియోగదారులు గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి టెక్నికల్ సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా భూములకు సంబంధించి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది వినియోగదారులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి నిరాశతో వెనుదిరిగారు. మరి కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద వెయిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆ శాఖ అధికారులను జనం నిలదీసిన సందర్భాలు లేకపోలేదు.
సర్వర్లలో సాంకేతిక లోపం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పడిగాపులు
సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ సహా ఏ పని సాగలేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మధ్యాహ్నం రెండు గంటలు గడిచినా అక్కడే ఉన్నారు. ఏ క్షణమైనా పని జరిగిపోవచ్చని భావిస్తున్నారు.
నార్మల్గా ప్రక్రియలో నాలుగైదు విభాగాలు కీలకంగా ఉంటాయి. తొలుత డాక్యుమెంట్ విభాగం దానికి కచ్చితంగా నెట్ వర్క్ ఉంటేనే పని వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ విధానంలో అన్నీ పరిశీలన చేస్తారు. చివరిగా సబ్ రిజిస్ట్రార్ వద్ద ఆయా దస్త్రాలు వెళ్తాయి. సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చిన వారు సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయని అడుగుతున్నారు.
ALSO READ: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే
పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో కొంతమంది ప్రజలు వాగ్వాదానికి దిగిన సందర్భాలు కనిపించాయి. టెక్నికల్ టీమ్లు రంగంలోకి దిగాయి. సర్వర్ మొరాయింపులను సరి చేసేందుకు ఆయా టీమ్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వేగంగా సేవలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నాయి. సాధారణ స్థితికి వస్తుందో తెలియక అక్కడికి వచ్చిన వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.